- Advertisement -
రాజ్కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్ బాట్స్మెన్లలో అత్యధికంగా శిఖర్ ధావన్ 96 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్(80) నాటౌట్, విరాట్ కోహ్లీ(78), రోహిత్ శర్మ (42), జడేజా (20) నాటౌట్ పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్ల పడగొట్టగా రిచర్డ్ సన్ రెండు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా జట్టు ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 15 పరుగులు చేసి షమీ బౌలింగ్లో పాండేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. తొలి వన్డేలో ఆసీస్ గెలిచి 1-0తో ముందంజలో ఉంది.
Australia Target in 341 Runs in 2 ODI in AUS vs IND
- Advertisement -