Thursday, May 2, 2024

శబరిమలై ఆలయ సందర్శన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

పతనమిట్ట (కేరళ) : శబరిమలై లోని అత్యంత ప్రఖ్యాత అయ్యప్పస్వామి ఆలయాన్ని భక్తుల సందర్శనం కోసం బుధవారం సాయంత్రం తెరిచారు. ఏటా వచ్చే మండలంమకరవిలక్కు యాత్ర సీజన్ సందర్భంగా భక్తుల రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్ ఆంక్షలతో గత రెండేళ్లుగా పరిమిత సంఖ్య లోనే భక్తులు వచ్చారు. ఈసారి సగానికి సగం రెట్టింపు సంఖ్యలో భక్తులు దర్శిస్తారని అంచనా.

గత రెండేళ్లు కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రతిరోజూ 30 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించడమైందని, ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని కేరళ దేవస్థానం మంత్రి కె. రాధాక్రిష్ణన్ తెలిపారు. బుధవారం సాయంత్రం దాదాపు 30 వేల మంది భక్తులు వచ్చారని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షులు కె. అనంతగోపన్ చెప్పారు. గురువారం 41 రోజుల సుదీర్ఘ వార్షిక మండలం మకరవిలక్కు యాత్ర సీజన్ ప్రారంభమౌతుందన్నారు. దాదాపు 50 వేల మంది వస్తారని అంచనా వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News