Thursday, May 2, 2024

వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి రఘుమా రెడ్డి

హైదరాబాద్:  ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్)
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘు రెడ్డి సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో గురువారం ఖైరతాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ వాన కాలం సీజన్ ముగిసే వరకు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. వాతావరణంలో జరిగే మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ, తగు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూపెరింటెండింగ్ ఇంజినీర్లకు, చీఫ్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలుజారీ చేశామని తెలిపారు.

వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు క్రింద సూచించిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు.అంతే కాకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడరాదన్నారు. వీలైనంతవరకు విద్యుత్ వైర్లకు, స్టే వైర్లకు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలన్నారు. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుండి దూరంగా ఉండటమే కాకుండా ఎక్కడైనా రోడ్ మీద, నీటిలో కాని విద్యుత్ తీగ పడి వున్న యెడల ఆ తీగను తొక్కడం గాని, వాటి మీద నుండి వాహనాలు నడపడం గాని చేయరాదన్నారు.

ఒక వేళ ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి గాని, కింద ఇవ్వబడ్డ నెంబర్ల ద్వారా సంస్థ దృష్టికి తీసుకు రాగలరు.విద్యుత్ స్తంభాలను, స్టే వైర్ల ను తాకరాదు. ఒక వేళ ఎవరైనా తాకి విద్యుత్ షాక్ బారిన పడ్డప్పుడు వారిని రక్షించడానికి విద్యుత్ ప్రవాహకాలైన లోహపు రాడ్లను ఉపయోగించకుండా చెక్క/ ప్లాస్టిక్ తో చేసిన పైప్ లను మాత్రమే వాడాలన్నారు.చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వాటి పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయలన్నారు.విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్ కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లు పై ముద్రితమైన యఎస్‌సి నెంబర్ ను సిద్ధంగా వుంచుకోవాలన్నారు.లోతట్టు ప్రాంతాలు, ముంపుకు అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు నీటి ప్రవాహం అధికంగా నున్నప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382071574, 7382072106, 7382072104 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడమే సంస్థ మొబైల్ ఆప్, వ్బ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News