Friday, May 3, 2024

బిజెపి నాయకులు, కార్యకర్తలు కసితో పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్‌:  నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్‌లలో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన చేవెళ్ల ఎంపి సెగ్మెంట్ ఫరిధిలోని బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో వచ్చేది మళ్లీ మోడీ ప్రభుత్వమేనని, ఈ విషయంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికతో పనిచేసి మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లతో ప్రజలకు ఒరిగేదేం లేదని పేర్కొన్నారు. ఎంపి ఎన్నికల్లో తెలంగాణ బిజెపిదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, వాటి డిఎన్‌ఏ ఒక్కటేనని విమర్శలు చేశారు. బిఆర్‌ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రేస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఒకటేనన్నది దీని ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై దర్యాప్తునకు తాము సిద్ధమని సిబిఐ చెబుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వ సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చాలని చూస్తోందని పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని, ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని, తొమ్మిదిన్నరేండ్లలో లక్షల కోట్ల నిధులు మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని, జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టులు సహా  ట్రైబల్ వర్సిటీ, పసుపు బోర్డు, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ నాయకులు,కార్యకర్తలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News