Tuesday, April 30, 2024

అత్తింటి వేధింపులు తట్టుకోలేక…. బిజెపి ఎంపి కోడలు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

BJP MP's Sister in law suicide attempt

లక్నో: అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ బిజెపి ఎంపి , ఎంఎల్‌ఎ కోడలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అంకిత అనే అమ్మాయిని బిజెపి ఎంపి కౌశిల్ కిశోర్ తనయుడు ఆయుష్ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని బిజెపి ఎంపి, అతడి భార్య ఎంఎల్‌ఎ జైదేవీ వ్యతిరేకించడంతో ప్రేమజంట మాండియాన్ మొహల్లా ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. మార్చి-3న ఆయష్ కు బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు విచారణలో తనకు తానే కాల్చుకున్నానని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆయుష్ కనిపించకుండాపోయాడు. తాజాగా ఆయుష్ భార్య అంకిత తన చేతి నరాలను కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో లక్నో సివిల్ ఆస్పత్రికి తరలించారు. అత్తింటి వారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నానని మీడియాకు వివరించింది. మామ బిజెపి ఎంపి కౌషల్ కిశోర్, భార్య ఎంఎల్‌ఎ జై దేవి, తన భర్త సోదరులు తనని వేధించారని వీడియోలో పేర్కొని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో అలీగంజ్ ఎస్‌పి అఖిలేష్ సింగ్ ఆమె ఎక్కడుందో తెలసుకొని ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంట్లో ఉన్న కోడలినే వేధిస్తున్నడంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News