Thursday, May 2, 2024

నవవధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అత్తాపూర్‌కు చెందిన కిరణ్‌కుమార్‌కు పుష్పాంజలికి ఎనిమిది నెలల క్రితం వివాహం అయింది. భార్యభర్తలు ఇద్దరు అత్తాపూర్‌లో కొత్తగా కాపురం పెట్టారు. ఉదయం బయటికి వెళ్లిన కిరణ్ ఇంటికి తిరిగి వచ్చే సిరికి తలుపులు పెట్టి ఉన్నాయి.

ఎంత సేపు కొట్టిన పుష్పాంజలి తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసేసరికి పుష్పాంజలి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. వెంటనే కిరణ్ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నవవధువు మృతికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News