Friday, September 19, 2025

టీచర్లకు బ్రిటన్ శిక్షణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి వారితో చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ గురించి సిఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సిఎం వారిని కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బిసిసి, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు. సిఎం విజ్ఞప్తులపై బ్రిటిషన్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ-, యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు..నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది: కిషన్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News