Friday, May 3, 2024

రేవంత్ రెడ్డి ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి: దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారని బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ గౌరవం పెరిగేలా మాట్లాడాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అన్నారు. పెట్టుబడుల వేదికను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని సూచించారు. మేము రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లడటం లేదు.. ఆయన మాటల్లోని భావం గురించే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా సిఎం మాట్లాడటం సరికాదని చెప్పారు. అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ ఒక గౌరవం సాధించిన నేత కెటిఆర్ అన్నారు. కెటిఆర్ డూప్లికేట్ అని దావోస్ లో మాట్లడటం సరికాదని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News