Friday, May 3, 2024

ఎంఎల్‌సి కవితతో బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల బృందం భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎంఎల్‌సి కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల బృందం పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎంఎల్‌సి కవితను ఆమె నివాసంలో మంగళవారం ఆమె నివాసంలో మహేష్ బిగాలా నేతృత్వంలో బుధవారం వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐలు అమెరికా నుంచి మహేష్ తన్నీరు (బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ అడ్వైజరీ చైర్), చందు తల్లా (బిఆర్‌ఎస్ యుఎస్‌ఎ కన్వీనర్), హరీష్ రెడ్డిచ సురేష్‌లు కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంఎల్‌సి కవితతో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలు మాట్లాడుతూ, మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని అన్నారు.

ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం ఒబిసిలకు రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు చేపట్టాలి అని పేర్కొన్నారు. అదే పోరాట పటిమతో ముందుకు వెళ్లాలని అన్నారు. మహిళా, ఒబిసి రిజర్వేషన్లకు మద్దతుగా బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలలో అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు అందరూ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా బిఆర్‌ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐల తరపున ఎన్నికల ప్రచార ప్రణాలికను సిద్ధం చేశారని అన్నారు. వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అలాగే సోషల్ మీడియా క్యాంపెయిగ్‌కు, టెలీఫోనిక్ కాంపెయిన్‌లతో ప్రజల్లోకి బిఆర్‌ఎస్ పథకాలను తీసుకెళ్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News