Thursday, April 25, 2024

ఎక్కడికక్కడ ఎండగట్టండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర వి ధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపిలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గొంతుని వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సిఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథాలో మార్గాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలన్నారు. ఈ దిశగా బిఆర్‌ఎస్ పార్టీ తో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

నాలుగు గంటలకుపైగా సాగిన ఈ సమావేశం అనేక అంశాలను చర్చించింది.ప్రధానం గా కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్ర మాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతున్న అంశాలపై కూలంకషంగా చర్చించింది. ఈ పరిణామాలపై సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా కేంద్రం తమ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. తమ అనుకూల కార్పొరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నదన్నారు.

ఈ అంశాలపై బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు సిఎం కెసిఆర్ సూచించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ) , నామా నాగేశ్వర్ రావు(లోక్ సభ), ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు.

దేశ సంపదను ప్రైవేట్‌పరం చేస్తోంది
ఎల్‌ఐసి, ఎస్‌బిఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతోందని కెసిఆర్ మండిపడ్డారు. వారి కంపెనీల డొల్లతనం బైటపడుతూ వారి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తున్నదని కెసిఆర్ అన్నారు. వారి లాభాలు, సంపదంతా నీటిబుడగలేనని స్పష్టమైతున్నదన్నారు. ఇటువంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రయివేట్ పరం చేస్తూ కేంద్రం తీరని నష్ట చేస్తున్నదని వ్యాఖ్యానించారు. లాభాలను ప్రయివేట్ పరం చేస్తూ…నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరిని బిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలని ఈ సందర్భగా సిఎం కెసిఆర్ హితబోధ చేశారు.

ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని కెసిఆర్ అన్నారు.. దీనిపై కూడా పార్లమెంటులో నిలదీయాలని సూచించారు. ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న కారణమేందో జాతికి చెప్పాలని కేంద్రాన్ని నిలదీయాల్సి ఉందన్నారు.

దుర్వినియోగం అవుతున్న గవర్నర్ల వ్యవస్థ
కేంద్రం రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని సిఎం కెసిఆర్ ఆరోపించారు. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్ర రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను బిఆర్‌ఎస్ ఎంపీలుగా ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కేబినెట్ సహా అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకున్న నిర్ణయాలను సైతం ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతూ గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని మీరు పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలన్నారు.

కలిసివచ్చే పార్టీలను కలుపుకుని పోండి!
దేశ భవిష్యత్తు కోసం, ప్రజా సమస్యల మీద పార్లమెంటులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీద పోరాటానికి బిఆర్‌ఎస్‌తో కలిసివచ్చే ప్రతి ఒక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోవాలని పార్టీ ఎంపిలకు కెసిఆర్ సూచించారు. పెట్రోల్, డీజిల్‌తో సహా వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నయి. సామాన్యుడి బతుకు పెరుగుతున్న ధరలతో రోజు రోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న బాధలను కష్టాలను పార్లమెంటు ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకపోవాలని ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

విభజన హామీలపై
కేంద్రాన్ని వదిలిపెట్టొద్దు

తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై కేంద్రా న్ని నిలదీయాలని కెసిఆర్ పార్టీ ఎంపిలకు సూచిం చారు. న్యాయంగా దక్కాల్సిన వాటాలపై ప్రశ్నిం చాలన్నారు. బిజెపి పాలనలో రోజురోజుకూ దేశం లో నిరుద్యోగం పెరుగుతున్నదని కెసిఆర్ ఆరోపిం చారు. ప్రధానంగా దేశ యువతను ఏమాత్రం ప ట్టించుకోకుండా, వారికి ఉద్యోగ భధ్రత కల్పించ కుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ తీరని నష్టం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ అంశంపై గట్టిగా గొంతు వినిపించాలని ఆయన పార్టీ ఎం పిలకు స్ప ష్టం చేశారు. అలాగే తెలంగాణకు రా వాల్సిన విభజన హామీలపై కేంద్రం ప్రభుత్వం ని మ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని ధ్వజ మెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News