Friday, April 19, 2024

లచ్చిగూడెంలో ఉపాధ్యాయుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Teacher

 

దుమ్ముగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండల పరిధిలోని లచ్చిగూడెం గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు ఆదివారం అర్థరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కధనం ప్రకారం… లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన రామకృష్ణ(35) స్థానిక ఎంఇఒ కార్యాలయంలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్(సీఆర్సీ)గా పని చేస్తున్నారు. సుమారుగా రెండేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన ముద్దరాజు, అతని కొడుకు రవిలకు, కారంచిన రామకృష్ణ కుటుంబానికి మధ్య భూమికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి.

8 నెలల క్రితం ఆ భూమి ముద్దరాజుకు చెందినదని దుమ్ముగూడెం తహసీల్దార్ చెప్పడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు అప్పటి నుంచి ఆ భూమి జోలికి వెళ్లడం మానేశారు. కానీ ముద్దరాజు, రవిలు రామకృష్ణ, అతని భార్య తులసి ఎక్కడ కనిపించినా భూమి కావాలా … మీ అంతు చూస్తాం.. ఎప్పటికైనా మిమ్మల్ని చంపుతామని బెదింరించేవాళ్ళు.

ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి సుమారు 1 గంట సమయంలో రామకృష్ణ,తులసిలు ఇంట్లో నిద్రిస్తుండగా ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, ఇద్దరు వ్యక్తులు రామకృష్ణపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనతో తులసికి మెలుకువ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న తులసి బయటకొచ్చి కేకలు వేసింది. దీంతో నిందితులు పరారయ్యారు. చిక్సిత కోసం రామకృష్ణను భద్రాచలం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

ముద్దరాజు, అతని కొడుకు రవి, మరో వ్యక్తి కలసి రామకృష్ణను చంపి ఉంటారని రామకృష్ణ భార్య తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సిఐ ఘటనాస్థలిని పరిశీలించారు. రామకృష్ణ దారుణహత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న ఎంఇఒ సున్నం సమ్మయ్య, ఉపాధ్యాయుడు ఎజె ప్రభాకర్‌తో పాటుగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు రామకృష్ణ మృతదేహన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Brutal Murder of Teacher
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News