ఆగ్రా: ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్వేపైన నిలిపి ఉన్న ఒక కారులో ఒక బంగారం వ్యాపారి, ఆయన భార్య, కుమార్తె మృతదేహాలు లభించాయి. కారులో నుంచి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నట్లు మథుర ఎస్ఎస్పి షలబ్ మాథుర్ తెలిపారు. మృతులను నీరజ్ అగర్వాల్(40), ఆయన భార్య నేహ(35), వారి ఎనిమిదేళ్ల కుమార్తెగా గుర్తించారు. ఎక్స్ప్రెస్వే మీద ఒక కారు ఆగి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. గ్రామస్తులు కారు అద్దాలు పగులగొట్టి కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న అగర్వాల్ కుమారుడు పదేళ్ల శౌర్యను రక్షించారు. శౌర్యను మథురలోని నియతి ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందచేస్తున్నారు. నీరజ్, ఆయన భార్య అగ్రాలోని ఒక నగల షాపుకు డైరెక్టర్లుగా ఉండేవారని, భారీ నష్టాలు రావడంతో ఆ షాపును మూసివేశారని తెలుస్తోంది.
Bullion merchant commits suicide along with family