Friday, May 16, 2025

ఉప్పల్ లో కారులో అకస్మాత్తుగా మంటలు.. మాజీ ఎంఎల్ఎ కుటుంబ సభ్యులకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కుటుంబ సభ్యులు క్షేమం
ఉప్పల్ రింగ్ రోడ్డులో ఘటన
మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తార్నాక నుంచి ఉప్పల్ వైపుకు వస్తున్న మహేంద్ర కంపెనీ కి చెందిన థార్ (వెహికల్) లో అకస్మాత్తుగా మంటలు లేచాయి. డ్రైవింగ్ చేస్తున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ కుమారుడు ప్రవీణ్ గౌడ్ ఈ విషయం గమనించాడు. పొగలు, మంటలు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులతో సురక్షితంగా కారు దిగి 100 డయల్ సహకారంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి. నాగరాజు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ ను రప్పించి మంటలను ఆర్పించాడు.

దీంతో ప్రమాదం తప్పింది. మేడిపల్లిలో కారును సర్వీసింగ్ చేయించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రవీణ్ కుమార్ గౌడ్ మధ్యాహ్నం నగరంలో షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది. రోడ్డు మధ్యలో కారు నిలిచిపోవడంతో వచ్చిపోయే వాహనాలు రోడ్డు మధ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన డీజిల్ థార్ కారు సర్వీసింగ్ చేసిన రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరంగా ఉందని ప్రవీణ్ గౌడ్ తెలిపారు. అదృష్టం వల్ల బతికి బయట పడ్డామని పేర్కొన్నారు. ప్రవీణ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News