Tuesday, May 21, 2024

నవ్ నీత్ కౌర్ రాణాపై కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: షాద్ నగర్ పోలీసులు శుక్రవారం బిజెపి అభ్యర్థి నవ్ నీత్ కౌర్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై కేస్ బుక్ చేశారు. కాంగ్రెస్ ఓటేయడమంటే పాకిస్థాన్ కు మద్దతు ఇవ్వడమే అని ఆమె వ్యాఖ్యానించడంపై కేసు బుక్ అయింది.

ఎన్నికల పర్యవేక్షక అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులు నవ్ నీత్ కౌర్ పై కేసు బుక్ చేశారు. ఆమె బిజెపి టిక్కెట్ పై మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా నవ్ నీత్ కౌర్ వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఎన్నికల పర్యవేక్షణ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News