Thursday, May 2, 2024

థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను థాయిలాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మరోసారి చీకోటి ప్రవీణ్ వార్తల్లో నిలిచాడు. థాయిలాండ్‌లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడి పటాయాలో మొత్తం 90 మంది ఉన్న  చేశారు. ఈ 90మందిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడని సమాచారం. అంతేకాదు ఈ ముఠాలో మహిళలు 14 మంది ఉన్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ 90 మంది నుంచి భారీగా నగదును గేమింగ్ చిప్స్‌ను థాయిలాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ గ్యాంబ్లింగ్ అంతా చీకోటి ప్రవీణ్ నేతృత్వంలోనే నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 కోట్ల రూపాయల నగదు, ఎనిమిది క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్లు, మూడు నోట్ బుక్‌లను పోలీసులు సీజ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీంతో ముఖ్య నేరస్తుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్‌ను స్పెషల్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయని అతడిని విచారిస్తున్నట్లుగా సమాచారం. థాయిలాండ్ లో కఠినమైన చట్టాలు ఉంటాయి. నేరం చేసినట్లు నిరూపితమైతే చాలా దారుణమైన శిక్షలు పడతాయి అన్న విషయం తెలిసిందే. దీంతో, చీకోటి ప్రవీణ్ దొరికిపోవడంతో అతని మీద ఎలాంటి శిక్షలు పడతాయోనని అతని అనుచరుల్లో ఆందోళన నెలకొంది. థాయిలాండ్‌లోని ఒక హోటల్లో ఏప్రిల్ 27 నుంచి అందులోనే కాన్ఫరెన్స్ హాల్ను రెంటుకి తీసుకొని ఈ గ్యాంబ్లింగ్ తతంగం నడుపుతున్నట్లుగా వెలుగు చూసింది. ఈ వ్యవహా రంలో ఓ మహిళ కీలకంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ మహిళ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లింగ్ కోసం థాయి లాండ్‌లో చీకోటి ప్రవీణ్ ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక పటాయ పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ తో పాటు డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాధవరెడ్డి కూడా ఉన్నారు. పోలీసులను చూసిన వెంటనే తప్పించుకోవడానికి ఈ ముఠా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి మరీ పట్టుకున్నట్లు సమాచారం. చీకోటి ప్రవీణ్ థాయిలాండ్ లో పట్టుబడినట్లుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణలో క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, చీకోటి ప్రవీణ్ ధాయ్ ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ సాయంతో ఈ కేసినోను అక్కడ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భారత టూరిస్టులకు తాను ఇలాంటివి డబ్బులు తీసుకుని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, హోటల్‌లోని కన్వెన్షన్ హాల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నామని,

అక్కడకు ఎవరినీ అనుమతిం చకుండా ఒక్క హోటల్ స్టాఫ్ కు మాత్రమే అనుమతించేలా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే కార్డులు, కార్డు డీలర్స్, గ్యాంబ్లింగ్ సామాగ్రి మొత్తం ఇండియా నుంచే వచ్చిందని తనకు సంబంధంలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చిన వారంతా రేయింబవళ్లు ఈ జూదం ఆడుతున్నట్లుగా పట్టాయ పోలీసులు ప్రకటించారు. తాను విదేశాల్లో గ్యాంబ్లింగ్, కేసినోలు నిర్వహస్తానని చీకోటి ప్రవీణ్ బహిరంగం గానేప్రకటించారు. అయితే ధాయీలాండ్‌లో గ్యాంబ్లింగ్ చట్టబద్దమేనని చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని వాదించేవారు. కానీ ఇప్పుడు పట్టాయలోనే చట్ట వ్యతిరేకమని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జైలుకు పంపడం సంచలనంగా మారింది. గ్యాంబ్లింగ్‌కు మించి ఏదో చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండు మంది మహిళలు కూడా పట్టుబడటం అసలు వెళ్లిన వారు అంతా ఎవరు అన్నదానిపై చర్చజరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News