Thursday, May 2, 2024

ప్రాజెక్టుల పరిశీలనకు కేంద్ర బృందాలు

- Advertisement -
- Advertisement -
Central teams for consideration of projects
తొలివిడతగా తెలంగాణ పరిధిలోని గోదావరి బేసిన్‌లో పర్యటన,  కృష్ణా ప్రాజెక్టులకు మరో బృందం,  25 నుంచి పర్యటనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలును ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘంలోవున్న అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు ఈ నెల 25నుంచి తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నాయి. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేష్ అమలులో చిక్కుముడులు వీడటం లేదు. ప్రాజెక్టుల పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌లో పొందు పరిచిన అంశాలను మార్చాలని, నదీజలాల్లో రాష్ట్రాల వాటా తేల్చేదాక గెజిట్ అమలును నిలిపి వేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాలు చేసిన అభ్యర్ధనలను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు. కనీసం ఆ దిశగా కూడా ప్రయత్నం చేయకపోగా ఈ నెల 14నుంచే గెజిట్ అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. అయితే ఇటు కృష్ణానదీ పరివాహకంగా, అటు గోదావరి నదీ పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ , ఆంధ్రపదేశ్ రాష్ట్రాలు బోర్డులకు అప్పగించటంలో పడ్డ చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు.

దీంతో కృష్ణానదీయాజమాన్య బోర్డుతోపాటు, గోదావరి నదీయాజమాన్య బోర్డు కూడా గెజిట్ అమలులో ఏర్పడిన వాస్తవిక పరిస్థితులను వివరిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదికలు పంపాయి. ఈ నివేదికలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అమలులో గాడి తప్పిన పరిస్థితులను చక్కదిద్దే చర్యలు చేపట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ సయుంక్త కార్యదర్శి దేవశ్రీ ముఖర్జి కృష్ణా,గోదావరి బోర్డుల చైర్మన్లతో మాట్లాడారు. తెలంగాణ , అంధ్రప్రదేశ్ ప్రభుత్వాలనుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, ప్రాజెక్టులను బోర్డులకు అప్పగింతలో పెట్టిన షరతులు , ఇతర సమస్యలపై చర్చించారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర జలసంఘం అధికారులతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చీఫ్ ఇంజనీర్ అతుల్ కుమార్ నేతృత్వంలో కేంద్ర జలసంఘం నుంచి ఐదుగురు ఇంజనీర్లు, గోదావరి నదీయాజమాన్య బోర్డు నుంచి మరో ఇద్దరు ఇంజనీర్లతో కూడిన బృందం ఈ నెల 25నుంచి తెలంగాణ రాష్ట్రలో పర్యటించనుంది.

మూడు రోజుల పాటు గోదావరి నదీపరివాహక ప్రాంతం పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించనుంది. ఇందులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులను సందర్శించనున్నారు. మరో వైపు కృష్ణానది పరివాహక ప్రాంతం పరిధిలొని ప్రాజెక్టులను పరిశీలించేందుకు మరో బృందం కూడా ఈ నెల 25న రాష్ట్రానికి రానుంది. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనుంది. శ్రీశైలం , నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులు, వాటి రెగ్యులేటర్లు, జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల పంపుహౌస్‌లను పరిశీలించనుంది. కేంద్ర జలసంఘం నుంచి ప్రాజెక్టుల పరిశీలనకు వస్తున్న ప్రత్యేక బృందాల పర్యటన సమాచారాన్ని కృష్ణా, గోదావరి బోర్డులు తెలంగాణ, ఎపిఅధికారులకు తెలియపరిచినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News