- Advertisement -
హైదరాబాద్: వాహన దారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సినీ నటీ చార్మి అన్నారు. ఖైరతాబాద్లోని ఆర్టివో కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తన నూతన వాహన రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆమెకు ఆర్టివో రామచంద్రచౌహన్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్టివోలో వాహనదారులకు అందుతున్న సేవలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సమయంలో ఏకాగ్రత ఎంతో ముఖ్యమని మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నా ఇతరుల అజాగ్త్రత్త వల్ల కూడా తరచు ప్రమదాలు సంభవిస్తుంటాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. చార్మి వచ్చిందని తెలియడంతో అక్కడ ఉన్న ఆమె అభిమానులు ఆమెతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
Charmy Kaur Says Everyone Must Follow Traffic Rules
- Advertisement -