Monday, May 6, 2024

వార్డు కార్యాలయాల సిటీజన్ చార్ట్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: నగరవాసులకుమరింత మెరుగైన సేవలను అందించడమే లక్షంగా దేశంలోనే ప్రపథమంగా గ్రేటర్‌లో శ్రీకారం చుట్టిన వార్డు పరిపాలన వ్యవస్థలో భాగంగా ఈ నెల 16న వార్డు కార్యాలయాలలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యాలయాల ద్వారా ప్రజలకు అందించనున్న 17 ప్రత్యేక సేవలకు సంబంధించి నిర్ధేశించిన సమయ పాలనను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ట్విటర్ వేదికగా విడుదల చేశారు. పౌరుల నుంచి అందే ఫిర్యాదులను సంబంధిత విభాగం అధికారులు సిటిజన్స్ చార్ట్ ప్రకారం పరిష్కారించనున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ నిర్ధేశించిన సమయంలోపు సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాదు చేయాల్సిన పై అధికారి వివరాలను సైతం చార్ట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News