Friday, April 26, 2024

చరిత్ర పుటపై చెరగని సంతకం

- Advertisement -
- Advertisement -

ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్‌కు ప్రజలు ఎలాంటి బ్రహ్మరథం పట్టారో సరిగ్గా రెండు దశాబ్దాల తరువాత కూడా టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కెసిఆర్ పేరు సరిగ్గా అలాగే మార్మోగిపోతోంది.. ఒకసారి గతాన్ని స్మరించుకుంటే నాడు ఈ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా..? అని పిచ్చి ప్రశ్నలు సంధించిన వారు ఆ తరువాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో విమర్శించిన నోళ్లే ప్రశంసలతో ముంచెత్తాయి.. చివరికి తన చావుతోనైనా తెలంగాణ వస్తే చాలని ప్రజలకు చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు దిగి దాదాపు మృత్యువు అంచుల దాకా వెళ్లిన మహా మనిషి. యావత్ తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలిచిన రాజనీతి దురంధరుడైన కెసిఆర్ తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను ఉప్పొంగేలా చేసి, అసాధ్యమని భావించిన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ రథ సారథిగా చరిత్ర పుటపై ఎన్నటికీ చెరిగిపోని సంతకం చేశారు.

కెసిఆర్.. కెసిఆర్.. కెసిఆర్.. ఇప్పుడు యావత్ భారత దేశ వాప్తంగా లక్షలాది మంది జనాల నాలుకలపై పలుకుతున్న పేరు.. ఆ పేరుకు ఎందుకంత క్రేజ్, వివిధ రాష్ట్రాల్లో వేలు, లక్షల సంఖ్య లో పెరుగుతున్న ఫాలోయింగ్.. ఈ నెల 25న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బిఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశాలకు అక్షరాలా నాలుగు లక్షలకు పైగా ప్రతినిధులు పాల్గొన్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్‌కు ప్రజలు ఎలాంటి బ్రహ్మరథం పట్టారో సరిగ్గా రెండు దశాబ్దాల తరువాత కూడా టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కెసిఆర్ పేరు సరిగ్గా అలాగే మార్మోగిపోతోంది.. ఒకసారి గతాన్ని స్మరించుకుంటే నాడు ఈ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా..? అని పిచ్చి ప్రశ్నలు సంధించిన వారు ఆ తరువాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో విమర్శించిన నోళ్లే ప్రశంసలతో ముంచెత్తాయి.. చివరికి తన చావుతోనైనా తెలంగాణ వస్తే చాలని ప్రజలకు చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు దిగి దాదాపు మృత్యువు అంచుల దాకా వెళ్లిన మహా మనిషి.

యావత్ తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలిచిన రాజనీతి దురంధరుడైన కెసిఆర్ తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను ఉప్పొంగేలా చేసి, అసాధ్యమని భావించిన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ రథ సారథిగా చరిత్ర పుటపై ఎన్నటికీ చెరిగిపోని సంతకం చేశారు. స్వరాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించుకున్న తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాలతో కొత్త చరిత్రకు నాంది పలికి గడిచిన తొమ్మిదేండ్లలోనే సంక్షేమంలో స్వర్ణయుగం నిర్మాణం చేసి తిరుగులేని చక్రవర్తిలా, సార్వభౌమునిలా ప్రజారంజక పరిపాలన అందిస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, భారత దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా లేని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ మోడల్ అవసరమని నిరూపించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ తెలంగాణ జాతిపిత, బంగారు తెలంగాణ రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమ ప్రస్థానం, నేడు ఆయన సాగిస్తున్న సంక్షేమ స్వర్ణయుగం పరిపాలన గురించి ఒక సారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

మాటలతో మంటలు రేపగల ఉపన్యాస శక్తిమంతుడు
స్వతహాగా ఉపన్యసించడంలో కెసిఆర్‌కి పోటీ మరొకరు ఉండరనేది జగమెరిగిన సత్యం. తను ప్రసంగం మొదలు పెట్టారంటే ఎదుటివారి గుండెలను రగిలించగలరు.. తెలంగాణ ఆత్మగౌరవ భావనను గుర్తుండిపోయేలా చేయగలరు.. పోరాట పటిమను వెయ్యింతలు చేసి ఒక మహా విస్ఫోటనాన్ని రగిలించ గల ధీశాలి. అందుకే ఆయన స్థాపించిన పార్టీ ప్రజల నరనరాల్లో ఇంకిపోయేలా అనతి కాలంలోనే తెలంగాణలోని ప్రజలు వాస్తవాలను గుర్తించేలా చేశారు. స్వరాష్ట్ర సాధనకు తాను, తనతో పాటు ఉద్యమకారులు ఎన్ని సార్లు తమ పదవులకు రాజీనామాలు చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి తెలంగాణ వాదాన్ని గెలిపిస్తూ వచ్చారు.

దీనంతటికీ కారణం ఒకే ఒక్కడు మన కెసిఆర్. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశంలోనే మణిహారంలా మార్చి చూపిన మహోన్నతుడు కెసిఆర్. ఆయన జీవిత ప్రస్థానం, ఉద్యమ పోరాట పటిమ, సాహసం, అనితర సాధ్యం. తెలంగాణ పదాన్ని సైతం పలకడానికి భయపడే రోజుల్లో టిఆర్‌ఎస్‌ను స్థాపించి రాష్ట్ర సాధనకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవడంలో కెసిఆర్ చూపిన పరిణతి రాబోవు తరాలకు విలువైన పాఠ్యాంశంగా నిలిచిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో మహాత్ముని వలే అహింసా మార్గంలో, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని దీక్ష తో పోరాటాన్ని ముందుండి నడిపిన మార్గదర్శకుడు.

స్వర్ణ యుగానికి సార్వభౌముడు ఆయనే
సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ సమాజం ఛిన్నాభిన్నమైంది. ప్రజలు తమ కనీస అవసరాలు కూడా తీరక పేదరికంలో మగ్గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సంక్షోభం నుండి తమకు విముక్తి లభించదని భావించిన సకల జనులు, సబ్బండ వర్ణాలు ఏకోన్ముకంగా పోరాడారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైన తరువాత అట్టడుగు వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి కనీస జీవన భద్రత కల్పించాలన్న మహోన్నత ఆశయంతో 2014 నుండి 2023 వార్షిక బడ్జెట్లలో సింహ భాగం సంక్షేమానికి నిధులు కేటాయించడమే కాకుండా, వాటిని సద్వినియోగం చేసి, సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్పారు.

నాడు రూ. 200లుగా ఉన్న పించన్‌ను తెలంగాణ ఏర్పడగానే ఏకంగా రూ. 2016లకు పెంచి, బడుగుల బతుకులకు భరోసా కల్పించారు. గడిచిన ఎనిమిదేండ్లలో ఆసరా పించన్లకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 57,650 కోట్లు ఖర్చు చేసిందంటే సంక్షేమం ఏ స్థాయిలో ఉందో అర్థ్దం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని పేద ప్రజలకు తమ ఇంటి ఆడపిల్ల పెండ్లి పెద్ద ఆర్థిక భారం కాకూడదని భావించి ఆడపిల్ల పెండ్లికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంతో అండగా నిలిచింది. తొలుత రూ. 51 వేలతో ప్రారంభించి నేడు రూ. 1,00,116లు చెల్లించి వారి ఆత్మగౌరవాన్ని పదింతలు చేశారు. ఇప్పటికి గడిచిన ఎనిమిదేండ్లలో కల్యాణలక్ష్మి పథకానికి రూ. 8,182 కోట్లు, షాదీముబారక్ పథకానికి రూ. 1,902 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రతి తెల్లరేషన్ కార్డుదారునికి నెలకు 4 కిలోల బియ్యం మాత్రమే అందించేవారు. స్వరాష్ట్రంలో ఒక్కొక్కరికి 6 కేజీలు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు సన్నబియ్యాన్ని హాస్టళ్ల ద్వారా అందించి వారి బంగారు భవిష్యత్తుకు మార్గం చూపారు.

విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్య రంగా ల్లో అపూర్వమైన ప్రగతిని సాధించి, దేశానికి దిక్సూచీగా మారింది. ప్రధానంగా మావన వనరుల అభివృద్ధి పైనే సమాజాభివృద్ధి, సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న ప్రధానమైన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అందుకే విద్యారంగ వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఆవాస విద్యను ప్రోత్సహించాలని నిర్ణయించి, పెద్ద ఎత్తున గురుకులాలను స్థాపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో 134 ఎస్సీ గురుకులాలు ఉండగా 82,063 మంది విద్యార్థులుండేవారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో 238 గురుకులాల్లో మొత్తం 1.36 లక్షల మంది ఎస్‌సి విద్యార్థులు అత్యుత్తమ విద్యను అభ్యసిస్తున్నారు.ఇది ఒక చారిత్రక మార్కును స్థాపించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2014కు ముందు 91 ఎస్‌టి గురుకులాల్లో 31,391 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు మొత్తం 161 గిరిజన గురుకులాల్లో 66,168 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నాడు 12 మైనారిటీ గురుకులాల్లో 7,680 మంది విద్యార్థులుండగా, నేడు ఏకంగా రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకులాల్లో 1,20,880 మంది విద్యార్థులున్నారు.

నాడు ఉమ్మడి ఎపిలో 19 బిసి గురుకులాల్లో 8 వేల మంది విద్యార్థులుండగా, నేడు 280 బిసి గురుకులాల్లో 1,31,360 మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37 జనరల్ హాస్టళ్లుండగా 22,920 మంది విద్యార్ధులున్నారు. మొత్తం మీద రాష్ట్రం ఏర్పడక ముందు 293 గురుకులాల్లో 1,52,054 మంది విద్యార్థులుండగా, నేడు సిఎం కెసిఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా 920 గురుకులాల్లో ఊహించని విధంగా 4,77,450 మంది విద్యార్థులు ప్రభుత్వ గురుకులాల్లో చదువుకుంటున్నారు. ఇక డిగ్రీ కాలేజీల విషయంలోనూ అద్భుతమైన విద్యా విధానంతో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంది. మొత్తం 30 ఎస్‌సి డిగ్రీ కాలేజీల్లో 19,198 విద్యార్థులు, 01 బిసి డిగ్రీ కాలేజీలో 1,080 మంది విద్యార్థులు, 22 ఎస్‌టి డిగ్రీ కాలేజీల్లో 9,159 మంది విద్యార్థులున్నారు. మొత్తం 53 డిగ్రీ కాలేజీల్లో 29,437 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా విధానంతో చదువుకుంటున్నారు. యావత్ రాష్ట్రంలోని గురుకులాల్లో 5,06,887 మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును తరగతి గదుల్లో నిర్మించుకుంటున్నారు.

సబ్బండ వర్ణాలకు తరగని సంక్షేమం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలు మరే రాష్ట్రంలోనూ కనిపించని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా 70 ఏండ్లుగా దళితులకు అందని సంక్షేమం గురించి సమగ్రంగా ఆలోచించి రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు ఇంటికి రూ. 10 లక్షల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఈ పథకం కింద రూ. 4,404 కోట్ల నిధులు వెచ్చించి తిరుగులేని సంక్షేమం అందిస్తున్నారు.

రైతుబంధు పథకానికి రూ.65,481 కోట్లు, రైతు బీమాకు రూ. 5,384 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.17,351 కోట్లు, ఆసరా పించన్లకు రూ.57,650 కోట్లు, ఉపాధి హామీ కూలీకి రూ. 27,825 కోట్లు, కెసిఆర్ కిట్ పథకానికి రూ. 1,420 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ. 8,000 కోట్లు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 1,325 కోట్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీకి రూ.768 కోట్లు, రైతు వేదికల నిర్మాణానికి రూ. 572 కోట్లు, ఎస్‌సి పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రూ. 2,760 కోట్లు, దళితులకు ఉచిత విద్యుత్ రూ. 251 కోట్లు, ఎస్‌సి సబ్‌ప్లాన్‌కు రూ.70,965 కోట్లు, ఎస్‌టి సబ్‌ప్లాన్‌కు రూ. 37,779 కోట్లు, ఎస్‌టి పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రూ.639 కోట్లు, ఎస్‌టిలకు ఉచిత విద్యుత్ కింద రూ. 192 కోట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ కింద రూ.147 కోట్లు, పాలకు రూ.4ల చొప్పున ప్రోత్సాహకానికి రూ. 361 కోట్లు, గేదెల పంపిణీ కింద రూ. 370 కోట్లు, పంటల కొనుగోలుకు రూ. 6,195 కోట్లు, ధాన్యం కొనుగోలుకు రూ.1,21,000 కోట్లు, మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కోసం రూ. 435 కోట్లు, బతుకమ్మ చీరల పంపిణీకి రూ. 1,536 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ. 2463 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ. 919 కోట్లు ఖర్చు చేసి ఎనిమిదేండ్లలో తిరుగులేని సంక్షేమాన్ని అందించారు.

జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతి
గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని పరిశీలిస్తే తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో అసాధారణ ప్రగతిని సాధించింది. ఐటి రంగంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, తెలంగాణలో నూతన చట్టాల రూపకల్పన, సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ, సమగ్ర భూసర్వే, ధరణి పోర్టల్, భూ పరిపాలనలో సంస్కరణలు, ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు, నూతన జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు, నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సమగ్ర కుటుంబ సర్వే, తదితర బృహత్తర కార్యక్రమాలకు తెలంగాణ మెడలో మణిహారంలా తళుక్కుమంటున్నాయి. తెలంగాణలో నీటి పారుదల, ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 1,61,982 కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లు, వంతెనలు రూ. 12,462 కోట్లు, మిషన్ భగీరథ రూ. 39,000 కోట్లు, పల్లె ప్రగతికి రూ.16,084 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.15,961 కోట్లు, ఆర్‌అండ్‌బి రహదారులకు రూ. 11,606 కోట్లు, నిర్వహణకు రూ. 7,513 కోట్లు, స్వచ్ఛ్ భారత్‌కు రూ. 2,364 కోట్లు ఖర్చు చేశారు.

అదే విధంగా వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ. 1,329 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 8,735 కోట్లు, గొర్రెల పంపిణీకి రూ. 5వేల కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు రూ.49,314 కోట్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్లకు రూ. 19,126 కోట్లు, కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలకు రూ. 1,581 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమంలో అన్ని రంగాల్లో తెలంగాణ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. వీటితో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న కెసిఆర్ ఇటీవల టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి దేశంలోని ప్రజలందరికీ తెలంగాణ మోడల్‌ను అందించేందుకు సిద్ధపడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా కెసిఆర్.. కెసిఆర్.. అన్నపేరు లక్షలాది మంది నాలుకలపై నాట్యమాడుతోంది. రాబోవు రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందించి దేశం గర్వించే నాయకునిగా కెసిఆర్‌కు మద్దతునిద్దాం.. దేశంలో బిఆర్‌ఎస్ పెరుగుదలకు బాటలు వేద్దాం.. జై తెలంగాణ, జై కెసిఆర్…

వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News