Wednesday, May 8, 2024

భక్తి శ్రద్ధలతో ‘రంజాన్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లిం సహోదరులు పవిత్ర మాసంగా జరుపుకునే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వున్న ముస్లింలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆహ్వానం మేరకు వారి నివాసంలో శనివారం నాడు సిఎం కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం తమ నివాసానికి చేరుకున్న సిఎం కెసిఆర్‌కు మహమూద్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు, సిఎంకు శాలువాతో సత్కరించి పుష్ఫగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి నివాసంలో సాంప్రదాయపద్ధతిలో ఏర్పాటు చేసిన అతిథ్యాన్ని తన వెంట వచ్చిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తదితర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి సిఎం కెసిఆర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా రం జాన్ మాసంలో ఆచరించే పవిత్ర ఉపవాస దీక్షలు, జరిపే దైవ ప్రార్థనలు, ఈసందర్భంగా పెంపొందే క్షమాగుణం, కరుణ ప్రేమ తదితర ఆధ్యాత్మిక భావనల గురించిన అంశాలపై రంజాన్ పండుగ ప్రాశస్త్యం గురించి సిఎం స్మరించుకున్నారు. ఇవే అంశాలపై తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు ముస్లిం పెద్దలతో సిఎం కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తన ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియచేయాడానికి వచ్చిన పలువురు మత పెద్దలు, సామాన్యులను పేరు పేరునా పలకరించి, అలాయ్ బలాయ్ తీసుకుని వారికి సిఎం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఉద్యమకాలం నుంచీ నే టి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీని ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టి పిలిచి దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రు లు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సిలు కడియం శ్రీహ రి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ దానం నాగేందర్, జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్,సలీం, రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి దంపతులు కుమారుడు అజమ్ అలీ, కూతుర్లు కోడలు తదితర కుటుంబ సభ్యులు తమ అతిథ్యం స్వీకరించినందుకు సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు హోం మంత్రి జ్జాపికను బహుకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News