Tuesday, April 30, 2024

ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
CM KCR condoles martyrdom of Col Santosh Babu
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సిఎం కెసిఆర్ అన్నారు. సంతోష్‌బాబు తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు, ఇతర కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని సిఎం తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్‌రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

వీర సైనికులకు సెల్యూట్ : కెటిఆర్

భారత్ చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో వీర మరణం పొందిన సూర్యాపేట వాసితో సహా మిగతా వారందరికీ సెల్యూట్ అని, మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను దేశం మరవదని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కల్నల్ సంతోష్‌కు గుత్తా నివాళి

చైనా, భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ల్లో వీర మరణం పొందిన కన్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబుకు శాసనమండలి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

ప్రముఖుల సంతాపం

చైనా ముష్కరుల దాడిలో వీర మరణం పొందిన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన భారత కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు మృతి పట్ల వారి తండ్రి ఉపేందర్‌తో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ టెలిఫోన్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ భారతదేశ సరిహద్దులను మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్న తరుణంలో వారిపై జరిగిన అమానుషాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు చైనా శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిస్తూనే దాడులు జరిపి భారతసైనికుల ప్రాణాలు బలిగొనడం శోచనీయమని పేర్కొన్నారు.

భారతచైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు మరణం పట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. లడఖ్‌లోని గాల్వన్ లోయ సమీపంలో భారతచైనా మధ్య జరిగిన ఎ దురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వందనాలు సమర్పించారు. జవాన్లు అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించి దేశ సేవ కోసం ప్రాణాలర్పించారని, వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఎన్నటికీ మరువమన్నారు. మాతృభూమి సేవలో జాతి రక్షణ కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోలేటి సంతాపం

దేశ సేవలో వీర మరణం పొందిన సూర్యపేట వాసి కల్నల్ సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూర్చాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా భగవంతుడిని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప, సానుభూతులను ఆయన ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు.

వీర జవాన్లకు కోమటిరెడ్డి సంతాపం

భారత సైన్యంతో నేరుగా ఢీకొట్టే సత్తా లేక దొంగచాటుగా దాడి చేసిన ఘటనలో మృతి చెందిన వీరసైనికులకు తన ప్రగాఢ సంతాపాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి తెలిపారు. భారత్‌చైనా సరిహద్దులో చైనా ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన మన రాష్ట్రానికి చెందిన ముద్దుబిడ్డ మరణం విషాదకరం. చైనా చేసిన దాడిలో వీరమరణం పొంది భరతమాత ఒడిలో నేలరాలిన కల్నల్ సంతోష్‌కుమార్‌కు తన ప్రగాఢ సంతాపాన్ని కోమటిరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News