న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 2003 మరణాలు 10,974 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం సానుకూల కేసుల సంఖ్య 3,54,065గా ఉంది. వీటిలో ప్రస్తుతం 1,55,227 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,86,935 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ మహమ్మారి బారినపడి 11,903 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
అటు మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,13,445 లక్షల మందికి కరోనా సోకింది. ప్రస్తుతం 5,00,44 యాక్టివ్ కేసులుండగా… 5,537 మంది కోవిడ్ కబలించింది. తమిళనాడులో మొత్తం 46,504 కేసులు నమోదు కాగా… 479మంది కరోనాతో చనిపోయారు. డిల్లీలో 4,4688 మందికి కరోనా వైరస్ సోకింది. 1,837మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. గుజరాత్ లో ఇప్పటివరకు 24,628 మందికి కోవిడ్ సోకగా… 1,534 మంది ప్రాణాలు విడిచారు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు మూడు లక్షల యాభై వేలకు చేరువయ్యాయి.
2003 deaths and 10974 new COVID 19 cases India