Monday, May 13, 2024

నేడు రుణమాఫీ సంబురాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ బుధవారం ఆదేశాలు జా రీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు ని ర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కో సం అనేక కార్యక్రమాలను చేపట్టినదని, రైతన్నలకు హామీ ఇచ్చిన మేరకు బుధవారం రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విష యం అని అన్నారు. అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పా ర్టీ శ్రేణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అంశంలోనూ వారితో కలిసి సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు.

ఈ మేరకు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎ త్తున రైతులందరితో కలిసి సంబరాలను ఎవరికి తోచిన విధంగా వారు నిర్వహించాలని పార్టీ ఎంఎల్‌ఎలు నియోజకవర్గ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ ఎంఎల్‌ఎలు తమ తమ నియోజక వర్గాల్లో ఈ సంబరాల తాలూకు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుబంధు సమితులతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News