- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం సిఎం రేవంత్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం, పలువురు కేంద్రమంత్రులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులపై కూడా సిఎం రేవంత్ చర్చించనున్నారు.
- Advertisement -