Tuesday, April 30, 2024

రేపు కలెక్టర్లతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ భేటీకి కలెక్టర్లు అందరూ హాజరుకావాలని రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. సిఎంగా బాధ్యతలు చేపట్టాక కలెక్టర్లతో తొలిసారి సమావేశం అవుతున్నారు. ధరణి సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు, పరిపాలన అంశాలు, కీలక సమస్యలపై కలెక్టర్లతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు, పరిష్కార మార్గాలపై సమీక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News