Saturday, September 20, 2025

23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

* సీఎంతో పాటు మేడారం వెళ్లనున్న మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు
* జాతర కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు
* అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్న సీఎం
* అక్కడే అభివృద్ధిపై సమీక్షించి డిజైన్లను ఖరారు
* మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సిఎం సంప్రదించనున్నారు. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సిఎం రేవంత్‌రెడ్డిఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

23న సీఎంతో పాటు మేడారం కు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు వెళ్లనున్నారు. మేడారం జాతర పనులపై 23 న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు దట్టమైన అటవీ ప్రాంతం జల్లెడ పడుతుండగా, జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 16 న ముఖ్యమంత్రి మేడారంలో పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల సీఎం పర్యటన వాయిదా వేశారు. జాతర సమయం సమీపిస్తుండడంతో దాదాపు రూ. 150 కోట్లతో చేపట్టనున్న పనులను 100 రోజులలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరితగతిన పనులు చేపట్టిన పక్షంలో పనులు నాణ్యతతో పూర్తయ్యే అవకాశం ఉందని భావించి ముఖ్యమంత్రి పర్యటన ఖరారు చేసినట్లు సమాచారం.

Also Read: రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కల్వకుంట్ల కవిత

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News