Monday, May 13, 2024

ముగిసిన ఎంఎల్‌సి కవిత లండన్ పర్యటన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తన మూడు రోజుల లండన్ పర్యటనను విజయవంతంగా ముగిసింది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన కవిత పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మహిళా రిజర్వేషన్లు..ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల’ పాత్ర అనే అంశంపై ఆ సంస్థ నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు.

లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. అదే విధంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని, యుకె ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఎల్‌సి కవిత పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం, రాజకీయాల్లో మహిళల పాత్ర, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణం వంటి వాటిపై కవిత తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తన లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం నాడు హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యే సందర్భంలో లండన్ విమానాశ్రయంలో బిఆర్‌ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు,ప్రవాస భారతీయులు ఎంఎల్‌సి కవితకు వీడ్కోలు తెలిపారు.

Kavitha 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News