Tuesday, May 21, 2024

కవితకు మళ్లీ నిరాశే…!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు ఎన్నిసార్లు ప్రయత్నించినా బెయిల్ మంజూరు కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ రిజెక్ట్ అవ్వగా, ఈసారి బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఈ మేరకు 1149 పేజీలతో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. మే 6వ తేదీన ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు డిస్మిస్ చేసింది. దానిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు సమయం కావాలని ఇడి కోరింది. ఇడి సమయం కోరడంతో తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది.

మరోసారి కవితకు నిరాశ తప్పలేదు. మే 24న ఇడి వాదనల విన్న అనంతరం ఢిల్లీ హై కోర్టు తీర్పునిచ్చే అవకాశాలు న్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఇడి అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో విచారించింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఆప్ పార్టీతో జరిగిన లావాదేవీలు, లిక్కర్ పాలసీలో అవకతవకలపై ప్రశ్నించగా కవిత ఏవీ చెప్పలేదని ఇడి అధికారులు వెల్లడించారు. కవిత అరెస్టై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికైనా ఆమె బెయిల్‌పై బయటికి వస్తుందని ఆశగా ఎదురుచూసిన బిఆర్‌ఎస్ శ్రేణులకు నిరాశ తప్పలేదు. కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అనేది 24న తేలనుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News