Friday, April 19, 2024

ఒకనాటి కాంగ్రెస్ ఎంఎల్‌ఏలపై పోలీసులకు ఫిర్యాదు!?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , మల్లు రవి, సంపత్ తదితరులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇదివరలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి పార్టీని వీడిన 12 మంది ఎంఎల్‌ఏలపై ఫిర్యాదు చేశారు.

ఆ 12 మంది ఎంఎల్‌ఏలు తమ స్వప్రయోజనాల కోసమే అధికార పార్టీలోకి చేరారని ఆరోపించారు. పార్టీ మారాక వారు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందారని తమ ఫిర్యాదులో వివరించారు. ఎంఎల్‌ఏల పార్టీ ఫిరాయింపుపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.

సబితా ఇంద్రా రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియా నాయక్, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు అప్పట్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో గెలిచి టిఆర్‌ఎస్‌లోకి పార్టీ ఫిరాయించారన్నది వారి వాదన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News