Friday, April 19, 2024

నేపాల్‌ మహిళతో అక్రమ సంబంధం.. జంట ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Attempt Suicide

 

రాజన్న సిరిసిల్ల : వివాహేతర సంబంధం ఓ జంట ఆత్మహత్యాయత్నానికి దారితీసిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పటి అంజికి గతంలోనే వివాహమైంది. ఆయనకు భార్య గంగు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తూ నేపాల్‌కు చెందిన ఓ జంట జీవిసిస్తున్నది. ఆ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా.. సమీప ఇంటిలో నివసిస్తున్న సదరు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడి భార్య మాయకు, గ్రామానికి చెందిన అంజికి పరిచయం ఏర్పడింది. అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా వారిద్దరూ మేడిపల్లిలో కనిపించకుండా పోయారు.

వేములవాడకు చేరుకుని వేములవాడ జాత్రాగ్రౌండ్‌లోని శ్రీసాయిరామ్‌ అద్దె గదిలో దిగారు. ఈ క్రమంలో అంజి భార్య గంగు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అక్కడి పోలీసులు ఫోన్‌ చేయగా అంజి స్టేషన్‌కు వెళ్లగా అధికారులు విచారించారు. మరుసటి రోజు స్టేషన్‌కు వస్తావని చెప్పి అక్కడి నుంచి అంజి తిరిగి నేరుగా వేములవాడలో అద్దెకు తీసుకున్న గదికి చేరుకున్నాడు. అనంతరం బంధువులకు ఫోన్‌ చేసి తాము ఒకరినొకరు వదిలి ఉండలేమని, ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపి మాయతో కలిసి పురుగుల మందును తాగాడు.

అప్పటికే వేములవాడకు చేరుకుని వారిద్దరి అచూకీ కోసం వెతుకుతున్న అంజి బంధువులు ఆందోళనకు గురై తిరిగి వెంటనే ఫోన్‌ చేశారు. అదేసమయంలో అంజి ఆపస్మాకరక స్థితికి చేరుకోవడంతో మాయ ఫోన్‌ను లిఫ్ట్‌ చేసి తాము ఎక్కడున్నది తెలపగా, వారు హుటాహుటిన అద్దెగది వద్దకు చేరుకున్నారు. తలుపులను బద్దలు కొట్టి వారిరువురినీ 108 వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సంఘటన వివరాలను తెలుసుకున్న పోలీసులు వైద్యశాలకు చేరుకొని ఆరా తీశారు. అయితే మాయ కూడా తన కుమారుడితో వేములవాడకు వచ్చిన ఉదంతం స్థానికులను కలిచివేసింది. ఇరువురికీ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

 

Couple Attempt Suicide in face of Fornication
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News