బెంగళూరు: బిడ్డకు తండ్రి ఎవరో చెప్పటానికి… ప్రియుడి డిఎన్ఎ కావాలని వివాహిత అతడిపై కేసు పెట్టిన సంఘటన కర్నాటకలో బీగురులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అనిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి సైక్లిస్ట్ సురేష్ ను పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడికి కరాటే నేర్పించటానికి కోచ్ రమేష్ (పేరు మార్చడం జరిగింది) దగ్గరకు వెళ్లడం జరిగింది. అనిత భర్త సైక్లిస్ట్ కావడంతో నెలల కొద్దీ బయటే ఉంటాడు. దీంతో కోచ్ రమేష్తో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. 2016లో అనిత ఓ పాపకు జన్మనించింది. అప్పుడప్పుడు అనిత దగ్గర అవసరాల కోసం రమేష్ డబ్బులు తీసుకునేవాడు. అదే సమయంలో రమేష్ కూడా పెళ్లి చేసుకొని అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. తనకు డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రమేష్ను అనిత అడిగింది. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో రమేష్ ఇంటికి వాళ్లతో గొడవ పెట్టుకుంది. కోర్టులో కేసులు వేసి నోటీసులు కూడా పంపించింది. ఇద్దరు మధ్య ఉన్న వివాహేతర సంబంధం ఆమె భర్తకు తెలియడంతో అనితను వదిలిపెట్టి సైక్లిస్ట్ వెళ్లిపోయాడు. తన కూతురుకు తండ్రి ఎవరో చెప్పాలని…. దీని కోసం రమేష్ డిఎన్ఎ కావాలని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో అనిత ఘర్షణ పెట్టుకుంది. దీంతో రమేష్, అతడి భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రియురాలుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మాత్రం అనిత భర్త సైక్లిస్ట్ డిఎన్ఎ టెస్టు చేస్తే సరిపోతుందని, ఎవరు తండ్రో తెలుస్తుందని సలహా ఇచ్చారు. కానీ ఆమె మాత్రం రమేష్ డిఎన్ఎ కావాలని పట్టుబడుతోంది. రమేష్ దంపతులు మాత్రం డిఎన్ఎ టెస్టు చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు.