Thursday, May 2, 2024

నీరు లేక కరోనా రోగి మృతి

- Advertisement -
- Advertisement -

Covid Patient dies After Pleading for Water in Uttarakhand

హల్ద్వాని: కరోనా ఆసుపత్రిలో నీరు లేక కరోనా పెషెంట్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాగా దాహంగా ఉందని, కోవిడ్ వార్డులో నీరు సమకూర్చలంటూ 30 ఏండ్ల మహిళ వేడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ వీడియో చేసిన అనంతరం తీవ్ర అస్వస్థత గురైన మహిళ గురువారం మృతి చెందినట్టు తెలుస్తోంది. హల్ద్వాని జిల్లా సుసీలా తివారీ ఆస్పత్రిలో ఈ ఘటన కోవిడ్ ఆస్పత్రుల దుస్థితికి అద్దం పడుతుందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనను అధికారులు ఖండించారు. ఒక్కోరోగికి నాలుగు బాటిళ్ల నీటిని అందిస్తున్నట్టు తెలిపిన ఆస్పత్రి సిబ్బంది అనారోగ్యంతోనే మహిళ మృతి చెందినట్టు పేర్కొంది.

Covid Patient dies After Pleading for Water in Uttarakhand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News