Sunday, April 28, 2024

77వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో ప్రగతి యాత్రలో భాగంగా 77వరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్‌తో కలిసి పట్వారి ఎంక్లేవ్‌లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు, పార్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.35 లక్షలతో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేసినందుకు, సీసీ రోడ్డు ఏర్పాటుకు సహకారం అందిస్తున్నందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, స్థానిక డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఒంకార్ రెడ్డి, జల్దా లక్ష్మీనాథ్, కార్తిక్‌గౌడ్, క్రాంతి యాదవ్, శ్రీను, సాయి కిరణ్, యాదగిరి, మహిళా నాయకురాలు రాణి, భారతి, ఈశ్వరి, కాలనీ వాసులు వెంకటేష్, లక్ష్మణ్, శంకర్ రావు, సతీష్ గట్టోజి, యాదగిరి, మహబూబ్, బాలునేత, అల్లావుద్దీన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News