Thursday, April 25, 2024

దశాబ్ది ఉత్సవాలు దద్దరిల్లిపోవాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. బుధవారం నగరపాలక సంస్థ మున్సిపల్ సమావేశ మందిరంలో జూన్ 2 నుండి 21 రోజుల పాటు నగరంలో దశాబ్ధి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కలసి మ ంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించే విధంగా రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందన్నారు.

ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమ ంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకువెళ్లేలా రూపొందించిన ప్రణాళికను ఆయన నివేదించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి తొమ్మిది ఏ ళ్ళు పూర్తి చేసుకుని పదో ఏట అడుగిడుగుతున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వ రకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమేనని ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల ను ఆయా డివిజన్ల కార్పొరేటర్‌లు అధికారులు స మన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చే యాలన్నారు.

జూన్ 2వ తేదీన నుండి జరుగనున్న ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని సూ చించా రు. ఇలాంటి అవకాశం మనకు దక్కడం గర్వకారణమన్నారు. మనకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమ ంత్రి కేసీఅర్ పాలనలో తొమ్మిదేళ్లుగా జరిగిన ప్రగతి కొండం త అని కానీ మనం చెప్పుకునేది గోరంత అ ని ఆయన చెప్పారు. మీ డివిజన్ ల పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా హాజరుకావాలని, ప్రతి కార్యక్రమంలో శాఖహార, మాంసాహార భోజనాలు తప్ప క ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన అనేక అభివృద్ది పనులకు సంబంధించి నాడు – నేడు పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడు తూ దశాబ్ది ఉత్సవాలు ఖమ్మం మున్సిపల్ పరిధిలో ఘనంగా జరుపుకోవాలని కార్పొరేటర్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు.మున్సిపల్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసేవిధంగా డాకుమెంటరీ చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చై ర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ బైరి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News