Friday, May 3, 2024

గ్రూప్-2 పరీక్షపై 14న నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైకోర్టుకు నివేదించిన టిఎస్‌పిఎస్‌సి

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగుల తో ఆందోళనలతో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై తమ నిర్ణయం సోమవారం వెల్లడిస్తామని టిఎస్‌పిఎస్‌సి హైకోర్టుకు తెలిపింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భం గా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆగస్టు 2 నుంచి 30 వరకు వివిధ పోటీ పరీక్షలు ఉన్నాయని అన్ని పరీక్షల సిలబస్ వేర్వేరుగా ఉండడంతో గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ కావడం సాధ్యం కాదని దీంతో పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

దీనిపై టిఎస్‌పిఎస్‌సి కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ ఈ నెల 29, తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇటువంటి పరిస్థితుల్లో వాయిదా వేయడం కష్టమని తెలిపింది. అయితే, గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై వచ్చే సోమవారం (14వ తేదీన) స్పష్టమైన ప్రకటన చేస్తామని టిఎస్‌పిఎస్‌సి కౌన్సిల్ కోర్టుకు తెలిపింది. దీంతో సోమవారం కచ్చితంగా నిర్ణయం ప్రకటించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News