Thursday, May 2, 2024

ఢిల్లీ బిఆర్‌ఎస్ ఆఫీస్ రెడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలో నిర్మిస్తున్న బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. వసంత్‌విహార్‌లో నిర్మిస్తున్న నూతన కార్యాలయాన్ని ఈనెల 4న సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హస్తినకు చేరుకున్న పార్టీ నాయకులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే సిఎం కెసిఆర్ నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వసంత్ వి హార్‌లో 1,150 చదరపు మీటర్ల స్థలంలో మొత్తం ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.

బుధవారం (4వ తేదీ)న నూతన కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ పూజలు నిర్వహించి ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి గడువు దగ్గర పడడంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం దృష్ట్యా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్ సోమవారం సాయంత్రం హస్తినకు వెళ్లారు. నూతనంగా రూపుదిద్దుకున్న ఈ పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్ కోసం ప్రత్యేక గదితో పాటు మొత్తం 18 రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్ ఉండేలా నిర్మించారు. అదేవిధంగా అతిథుల కోసం రెండు సూట్ రూమ్‌లను కేటాయించారు. వివిధ కార్యక్రమాలు, పనుల నిమిత్తం పార్టీ కార్యాలయానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఈ నెల 4వ తేదీన సుమూహూర్తం

ఈ నెల 4వ తేదీన సుమూహూర్తం ఉండటంతో అదే రోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బిఆర్‌ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ వసంత్‌విహార్‌లోని కార్యాలయానికి చేరుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పండితులు హోమం, వాస్తు పూజలు నిర్వహించను న్నారు. ప్రారంభోత్సవం అనంతరం సుమారు గంట సేపు కొత్తగా నిర్మించిన కార్యాలయంలో సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ నాయకులతో పలు అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News