Sunday, April 28, 2024

క్రికెట్‌కు ధవళ్ కులకర్ణి గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్ ధవళ్ కులకర్ణి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కాలం పాటు దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ధవళ్ రంజీ ట్రోఫీ ఫైనల్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటానని ధవళ్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ధవళ్ ముంబై తరఫున ఆరు సార్లు రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. ఈ క్రమంలో ఐదు సార్లు జట్టును విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర పోషించాడు. అండర్14, అండర్19 విభాగాల్లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. కాగా, 2014లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. అయితే ధవళ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అతను 12 వన్డే, రెండు టి20లలో మాత్రమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపిఎల్‌లో వివిధ జట్ల తరఫున 92 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 281 వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News