Wednesday, May 8, 2024

గుంతలు తీసిండ్రు.. పూడ్చడం మర్చిండ్రు

- Advertisement -
- Advertisement -

కోహీర్: రోడ్డు పొడువునా కేబుల్ వైర్ల కోసం గుంతలు తవ్వి కేబుల్ కనెక్షన్ అమర్చి గుంతలు తవ్విడం మర్చిపోవడంతో గత రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో తవ్విన మట్టి బురదమయంగా మారడంతో జహీరాబాద్‌నుంచి కోహీర్ వయా హుగ్గెల్లి, రాజినెల్లి, మద్రి, గురుజువాడ గ్రామాల వాహనదారులకు రాకపోకలకు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. తీసిన గుంతలు పూడ్చలంలో అధికారు ల నిర్లక్ష్యానికి నిండు సాక్షంగా కనిపిస్తోంది.. గతమూడు రోజుల క్రితం రోడ్డుపై వాహనదారులు వెళ్తున్న క్రమంలో కింద పడి గాయాలయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రాజినె ల్లి, గురుజువాడ, మద్రి గ్రామాలరోడ్డు పక్కన తవ్విన గుంతలను పూడ్చి వేయాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News