Friday, April 19, 2024

ఆపరేషన్ థియోటర్ లో పసికందును పీక్కుతిన్న కుక్క

- Advertisement -
- Advertisement -

Dog

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో మంగళవారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఆపరేషన్ థియోటర్‌లో పసికందును కుక్క పీక్కు తినడంతో నవజాత శిశువు చనిపోయింది. దీంతో పోలీసులు ఆ ప్రైవేటు ఆస్పత్రి యజమాన్యం. సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రవి కుమార్ అనే వ్యక్తి తన భార్య కాంచనకు పురటి నొప్పులు రావడంతో ఆకాశ్ గంగా అనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు పరిశీలించి ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ థియోటర్‌లో సిజేరియన్ చేసిన కాంచనను వార్డుకు పంపించారు. అనంతరం పసికందును ఆపరేషన్ థియోటర్‌లోనే ఉంచారు. ఓ కుక్క ఆపరేషన్ థియోటర్‌లోకి ప్రవేశించి పసికందును పీక్కుతిన్నది. నర్సు లోపలికి వెళ్లి చూడా నవజాత శిశువును కుక్క పీక్కుతింటున్న దృశ్యాలు కనిపించడంతో కేకలు వేసింది. వైద్యులు, సిబ్బంది అక్కడి వచ్చే చూసేసరికి కుక్క దాడిలో పసికందు చనిపోయింది.

పసికందు చాతి, మెడ భాగంలో గాయాలతో చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే తన పాప చనిపోయిందని రవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో డబ్బులిస్తామని ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. రవి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జిల్లా న్యాయమూరి మన్వేంద్ర సింగ్ ఈ ఘటనపై స్పందించారు. పసికందు మృతిలో ఆస్పత్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆస్పత్రి సిబ్బంది, యజమాన్యంపై 304 ఎ ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఫరూఖాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేయాలని అధికారులకు సూచించడంతో పాటు మూడు రోజుల్లో రిపోర్టు కావాలని ఆదేశించాడు. ప్రస్తుతం ఆ ఆస్పత్రిని మూసివేశామని ఫరూఖాబాద్ డిఎం తెలిపారు. ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ ఉందని డిప్యూటి సిఎంఒ రాజీవ్ శక్య పేర్కొన్నారు.

 

Dog eat baby in private hospital operation theatre,
dog enter into operation theatre and killed infant born in Monday in Farrukhabad in Uttarpradesh
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News