Thursday, May 2, 2024

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నల్గొండ:మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం నలగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీ కాలనీకి చెందిన గడ్డం నవీన్ కు మార్ (25) సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్నాడు.

ఇటీవల ఆయన మద్యానికి బానిసై ఉద్యోగం కూడా సరిగా చేయకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో జీవిత ంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన అతని భార్య చూసి నవీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భా ర్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్త్స్ర జూకూరు సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News