Tuesday, April 30, 2024

ట్విట్టర్ సిఇఓకు ఎలాన్ మస్క్ వార్నింగ్!

- Advertisement -
- Advertisement -

Elon Musk Warning To Twitter CEO

న్యూఢిల్లీ : ఏకంగా 44 బిలియన్ డాలర్లు పైబడిన ట్విట్టర్- మస్క్ డీల్ రద్దుపై డ్రామా కొనసాగుతోంది. ఒప్పందం రద్దు చేసుకోవడానికి ముం దు ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్‌కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వార్నింగ్ ఇచ్చారని లాయర్లు కోర్టుకు వెల్లడించారు. ‘ ట్విట్టర్ యూజర్లలో నకి లీ లేదా స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువున్నాయనే సమాచారం అడగడంతో నన్ను ఇ బ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఆటంకాలు సృష్టించడంపై మీ లాయర్లు చర్చిస్తున్నారు. వాటి ని ఆపేయండి ’ అని హెచ్చరిస్తూ పరాగ్ అగర్వా ల్, ట్విట్టర్ సీఎఫ్‌వో నెడ్ సెగల్‌కి జులై 8న ఎలా న్ మస్క్ సందేశం పంపించారని లాయర్లు వివరించారు. ట్విట్టర్ డీల్ రద్దు చేసుకోవడానికి ముందే మస్క్ ఈ హెచ్చరికలు పంపారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్విటర్ డీల్ పూర్తి చేయడానికి నిధులు ఏవిధంగా సమకూర్చుకోబోతున్నారని కోరగా ఆయన నుంచి ఈ విధమైన రిప్లై వచ్చిందని వివరించారు.

మస్క్‌పై ట్విటర్ దావా..
44 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెసా అధినేత ఎలాన్ మస్క్‌పై ట్విట్టర్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సెరీలో ఇటీవలే దావా వేసింది. నీతినిజాయితీలేని చర్యలతో ట్విట్టర్‌కు పూడ్చలేని నష్టాన్ని తెచ్చిపెట్టారని మస్క్‌ని విమర్శించింది. ట్విట్టర్ షేర్లు అపార నష్టాన్ని చవిచూడడానికి మస్క్ చర్యలే కారణమని పిటిషన్‌లో తీవ్ర విమర్శలు చేసింది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను మస్క్ ఉల్లంఘించారని, ఒప్పందం కారణంగా స్టాక్ హోల్డర్లు దీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపించడంలేదని వాపోయింది. ‘ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రతిపాదించాడు. ఒప్పందంపై సంతకం చేశారు. ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలిగారు. చట్టాలను మార్చేయవచ్చునని మస్క్ భావిస్తున్నారు. ట్విట్టర్‌ని తీవ్రంగా నష్టపరిచారు. కార్యకలాపాలు, స్టాక్ హోల్డర్ల వ్యాల్యూలను తీవ్రంగా దెబ్బతీశారు’ అని దావాలో పేర్కొంది. ఈ మేరకు డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సెరీలో పిటిషన్ వేసింది. ఈ కోర్టు బిజినెస్ వివాదాలను పరిష్కరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News