Monday, April 29, 2024

ఫేస్‌బుక్‌లో పరిచయం… యువతిపై గ్యాంగ్‌రేప్

- Advertisement -
- Advertisement -

Rape

 

లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతం అమర్హోలో జరిగింది. ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మైనర్ బాలికకు ఫేస్‌బుక్‌లో తహర్‌పూర్ గ్రామానికి చెందిన పుష్పేంద్ర చౌహాన్‌తో పరిచయమయ్యాడు. దీంతో యువతి ఫేస్‌బుక్‌లో గత కొన్ని రోజుల నుంచి చౌహాన్‌తో ఛాటింగ్ చేస్తోంది. దీంతో గజ్రౌలాలో ఒకసారి కలుద్దామని యువతితో యువకుడు చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన పుష్పేంద్ర… తన ముగ్గురు స్నేహితులు కవేంద్ర చౌహాన్, జైవీర్ చౌహాన్, మరో యువకుడుతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరుకైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. వెంటనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పుష్పేంద్రను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీస్ అధికారి ఆర్‌పి శర్మ తెలిపాడు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గతంలో డెహ్రాడూన్ పోలీస్ స్టేషన్‌లో జైవీర్ చౌహాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News