Friday, April 26, 2024

సింధుపై అభిమానులు ఫైర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు వ్యంగంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద పోస్ట్ పెట్టాల్సిన అవసరం సింధుకు ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా ఒక్క బ్యాడ్మింటన్ టోర్నీ ఆగిపోలేదని, టెన్నిస్, ఫుట్‌బాల్, హాకీ ఇలా చాలా క్రీడలపై దీని ప్రభావం పడిందని వారు పేర్కొంటున్నారు. ఇక కనీస జాగ్రత్తలు తీసుకుని బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనాల్సింది పోయి ఇలాంటి అర్థం పర్థంలేని పోస్ట్‌లు పెట్టడం ఏంటని వారు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా సింధు చేసిన రిటైర్మెంట్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో అందరిలోనూ అయోమయం నెలకొంది. కేంద్ర క్రీడల మంత్రి కిరన్ రిజిజు సయితం ఇలాంటి పోస్ట్ పెట్టిన సింధును తప్పుపట్టారు. అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఉన్న సింధు ఇలాంటి చర్యలకు దిగడం అంత మంచిది కాదని మంత్రి హితవు పలికారు. ఇదిలావుండగా నేను రిటైర్ అయ్యాను..డెన్మార్క్ ఓపెన్ నా చివరి ఆట అని సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Fans Slams PV Sindhu tweet on Retirement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News