Sunday, April 28, 2024

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. తల్లిదండ్రులకు క్షమాపణలు..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
కార్బన్ మోనాక్సైడ్ పీల్చి సూసైడ్
టాలీవుడ్,బాలీవుడ్ ప్రముఖలకు డిజైనర్‌గా పనిచేసిన ప్రత్యూష
సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రులకు, మిత్రులకు క్షమాపణలు

మనతెలంగాణ/హైదరాబాద్: బంజారాహిల్స్ ఎంఎల్‌ఎ కాలనీలో తన బొటిక్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష(36) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యూష బాత్‌రూంలో కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తమ ప్రాధమిక విచారణలో తేలిందని వివరించారు. వివరాల్లోకి వెళితే…బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణారావు కుమార్తె గరిమెళ్ల ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది. ఈక్రమంలో 2013లో హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రత్యూష ప్రముఖలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూషది 30వ స్థానమని, టాలీవుడ్, బాలీవుడ్, ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా ఆమె పనిచేసి వారి అభినందనలు అందుకుంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రత్యూష బోటిక్ నుంచి బయటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చి వాచ్‌మెన్ శనివారం నాడు బోటిక్ వెళ్లి చూసేసరికి బాత్‌రూంలో ప్రత్యూష అచేతన స్థితిలో పడివుంది. వాచ్‌మెన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి ఘటనాస్థలిని పరిశీలించారు. బాత్‌రూంలో ప్రత్యూష మృతదేహం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ సీసాలను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆవిరిలో కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ప్రత్యూష కార్బన్మోనాక్సైడ్ వాయువు పీల్చుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఇది జరిగింది ః
ప్రముఖ డిజైనర్ ప్రత్యూష శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన సొంతింటి నుంచి బోటిక్‌కు వచ్చింది. బోటిక్‌కు కేవలం ఒక బ్యాగ్‌తో వచ్చిందని, తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని లోపలికి వెళ్లేముందు వాచ్‌మెన్‌కు ప్రత్యూష చెప్పింది. అయితే ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో వాచ్‌మెన్ వెళ్లి చూడగా బాత్ రూంలో ఆమె కిందపడిపోయి ఉండటంతో వాచ్‌మెన్ పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానస్పద కేసు నమోదు ః
ప్రత్యూష మృతిపై అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే గత కొంత కాలం నుంచి ప్రత్యూష మానసింగా ఒత్తిడికి గురవుతున్నదని ఆమె స్నేహితుల ద్వారా తెలిసిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా ప్రత్యూష తన జీవితం ఇది కాదని, తాను కోరుకున్నట్లుగా జీవితం కొనసాగడంలేదని తన స్నేహితురాలు రమ్యతో శనివారం నాడు వాపోయినట్లు పోలీసు విచారణలో తేలింది. గత రెండు రోజుల నుంచి ప్రత్యూష ఇంటికి ఎవరెవరు వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఇంటి చుట్టుపక్కల ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రముఖుల డిజైనర్ ః
దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్ కావడంతో టాలీవుడ్,బాలీవుడ్ తారలు ప్రత్యూషతో దుస్తులను డిజైన్ చేయించుకునే వారు. వీరిలో ముఖ్యంగా దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతిహాసన్, రకుల్‌ప్రీత్‌సింగ్, శ్రియ, నిక్కీగల్రానీ, కృతికర్భంద, ప్రణీత,మాదురిదీక్షిత్, జూహ్లీచావ్లా, ఉపాసన, నిహారిక, కాజోల్, రవీనాటాండన్, నేహాదూపియా, హుమా ఖురేషి,త్రిష, టెన్నిస్ స్టార్ సానియామిర్జా తదితర ప్రముఖులకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైనర్‌గా పనిచేసింది. టాలీవుడ్,బాలీవుడ్‌లో పేరుగాంచిన హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్ చేసింది. కాగా ప్రత్యూష బంజారాహిల్స్‌లో సొంతంగా బోటిక్ నిర్వహిస్తోంది.
సూసైడ్ నోట్‌లో క్షమాపణలు:
తాను కోరుకున్న జీవితం ఇది కాదని, తల్లిదండ్రులకు తాను భారం కాకూడదని సూసైడ్ నోట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష పేర్కొంది. పోలీసులకు డిజైనర్ ఇంట్లోని బెడ్‌రూములో సూసైడ్ నోట్ లభించింది. ప్రతి రోజు ఏడుస్తున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తల్లిదండ్రులు, స్నేహితులు తనను క్షమించాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

Fashion Designer Prathyusha Suicide in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News