Thursday, May 2, 2024

మృతిచెందిన ఎఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

మృతిచెందిన ఎఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, సిటిబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎఎస్సైగా విధులు నిర్వర్తిస్తు మృతిచెందిన ఎఎస్సై కుటుంబానికి సిపి స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో సోమవారం ఎఎస్సై కుటుంబానికి చెక్కును అందజేశారు. ఎఎస్సై మహ్మద్ రవూఫ్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా దూలపల్లి చౌరస్తాలో మహ్మద్ రవూఫ్ విధులు నిర్వర్తిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనం బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రవూఫ్ కుటుబ సభ్యులను సిపి స్టిఫెన్ రవీంద్ర కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రత నుంచి ఎఎస్సై కుటుంబానికి రూ.7,88,240 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎఆర్ హెడ్ క్వార్టర్స్ ఎడిసిపి రియాజ్, సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News