Friday, May 3, 2024

ట్రాక్టర్ బోల్తా.. మత్స్యకారుడు మృతి

- Advertisement -
- Advertisement -

హత్నూర : చేపల పట్టడానికి  వళ్తూ రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన హత్నూర శివారులో చోటు చేసుకుంది. కుటుంబీకులు,పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర గ్రామానికి చెందిన గుడాల భానుచందర్ (37) శనివారం గ్రామ శివారులోని నడిమి చెరువు సమీపంలో గల తన పొలానికి వెళ్లి అక్కడే ఉన్న చెరువులో చేపల వేటకు

వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పి తన ట్రాక్టర్ పై వెళ్ళాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి తనకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మహేశ్వరి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. పోటోడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News