Thursday, May 2, 2024

300 కోట్లతో ఖమ్మంలో బిఆర్‌ఎస్ రాజకీయ ఉపాధిహామీ సభ: బూర నర్సయ్యగౌడ్

- Advertisement -
- Advertisement -

ఆదిబట్ల ః సిఎం కెసిఆర్ స్పిచ్‌కు పసలేదు, బిఆర్‌ఎస్‌కు దేశంలో ఎక్కడ బసలేదని భువనగిరి మాజి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. గురువారం ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని వైష్ణవి గార్డెన్‌లో బిజెపి నేతలతో కలిసి మాజి ఎంపి బూర నర్సయ్యగౌడ్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందదర్బంగా ఆయన మాట్లాడుతూ సిఎం కేసిఆర్ అవలంభిస్తున్న విధానాలు రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలు నెరవేర్చడంలో విపలమైన సిఎం బిఆర్‌ఎస్ పేరిట మరో కొత్త నాటానికి తెరలేపారని ఆయన విమర్శించారు. 300 కోట్ల రుపాయలతో ఖమ్మంలో నిర్వహించిన బిఆర్‌ఎస్ సభ రాజకీయ ఉపాధిహామి సభగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

అన్ని వనరులు ఉన్న మన దేశంలో ప్రజలు మెక్‌డోనాల్డ్ పిజ్జాలు బర్గర్లు తినడమేమిటంటూ కెసిఆర్ చేసిన వాఖ్యలను ఆయన తప్పు పట్టారు. కాళేశ్వరం, పెరిట లక్షన్నర కోట్లతో కేవలం 5.5 టిఎంసి సామర్థం గల రిజర్వాయర్‌ను నిర్మించారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదిని విమర్శిస్తున్న కెసిఆర్ ఎనిమిదెళ్లలో వృదాగా పోతున్న వర్షపు నీటికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. కంటివెలుగు కేవలం కంటితుడుపు చర్యేనని ఆయన విమర్శించారు. కేసిఆర్‌తో పోత్తుపెట్టుకోని కమ్యూనిష్టులు తమ క్యాడర్‌ను కారెక్టర్‌ను కోల్పోయారని విమర్శించారు. తెలంగాణ సంక్షేమం బిజెపి చేతుల్లోనే ఉందని అన్నారు. మోడి సారథ్యం దేశానికి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేతలు నాయిని సత్యానారాయణ, నోముల దయానంద్‌గౌడ్, గంగణమోని సతీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News