Saturday, July 27, 2024

ఎపిలో మూడు రాజధానులు హాస్యాస్పదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం హాస్సాస్పదంగా మాజీ ఎంపి.వి.హనుమంతరావు వ్యాఖ్యనించారు. దేశంలోనూ మూడు రాజధానుల విధానం లేదని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎపి రాజధానుల రగడ పై భాజపా సర్కార్ స్పందించాలని కోరారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పై ఈ నెల 25 తర్వాత కార్యచరణ ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఉద్యమానికి ఎన్ని అపమానాలు వచ్చినా, వీడేది లేదని విహెచ్ స్పష్టం చేశారు.

Former MP VH Comments on AP Capital Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News