Monday, April 29, 2024

వధువును ఆటోలో తీసుకెళ్తుండగా జారిపడి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పెళ్లి మండపానికి ఆటోలో వధువు తీసుకెళ్తుండగా వాహనంలో నుంచి జారిపడి నలుగురు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తర్లుపాడు-కొనకనమిట్ల మండలాల మధ్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి పొదిలికి ఆటోలో వధువును పెళ్లి మండపానికి తీసుకెళ్తుండగా కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై ఆటో వెనక భాగంలో కూర్చున్న నలుగురు వ్యక్తులు జారి కిందపడ్డారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు బోగాను సుబ్బారావు, శ్రీను, కనకం కార్తీక్, అనిల్‌గా గుర్తించారు. ఉదయం 11 గంటలకు వివాహ వేడుక ఉండడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News