Monday, May 13, 2024

ఎపిలో నాలుగు ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

Four Omicron variant cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడినుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగెటివ్ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెల 15న దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ నిర్ధరణ అయ్యింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు. మరో 9 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు వైద్యశాఖ వెల్లడించింది. గతంలో నమోదైన 2 కేసులతో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 4కు చేరింది.ఇదిలావుండగా ఎపి గడచిన 24 గంటల్లో 29,801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News